AP Cabinet: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్‌ భేటీ.. జగన్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే రేపు(సెప్టెంబర్ 20) ఏపీ కేబినెట్ భేటి కానుంది. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

New Update
AP Cabinet: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్‌ భేటీ.. జగన్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

AP Cabinet Meet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు(సెప్టెంబర్ 20) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గుంటూరులోని వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రానున్న అసెంబ్లీ సమావేశాలతోపాటు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

టార్గెట్ బాబు?
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 23 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ అధినేత అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు మరో 48 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారి కేబినెట్ భేటి కానుండడం. ఎల్లుండి(సెప్టెంబర్ 21)నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్‌ని ప్రస్తావించాలని.. ఆయన జైలుకు ఎందుకు వెళ్లారన్న విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ అసెంబ్లీలో ప్రధానంగా హైలెట్ చేసే అవకాశం ఉంది. వారి సమస్యలకు ఈ అసెంబ్లీలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలని జగన్‌ సర్కార్‌ అడుగులు వేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటివలి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.

గవర్నర్‌ ఆరోగ్యం ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు సభను సమావేశపరిచేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని ఈ నెల 15న ఒక అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యింది. ఇక నిన్న(సెప్టెంబర్ 18) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ అస్వస్థకు గురయ్యారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గవర్నర్‌ని సీఎం జగన్‌ స్వయంగా సందర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. అపెండిసైటిస్‌గా గుర్తించిన గవర్నర్‌ సోమవారం నాడు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అతనికి శస్త్ర చికిత్స నిర్వహించగా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ALSO READ: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని

Advertisment
Advertisment
తాజా కథనాలు