Ananthapuram: పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ.. జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు..!

అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి హింసకు తావు లేకుండా నిర్వహిస్తామన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలి. జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

New Update
Ananthapuram: పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ.. జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు..!

Ananthapuram: సమస్యాత్మక అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి హింసకు తావు లేకుండా నిర్వహిస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలి తెలిపారు. జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛేంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో ఎన్నికల సమయంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తానన్నారు.

Also Read: నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..!

ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూం లకు ఇప్పటికే మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు సృష్టించే వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతపురం జిల్లాలో హింసకు తావు లేకుండా, పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎస్పీ గౌతమి శాలి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు