Addanki Dayakar: ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అద్దంకి.. ఆ నేతను గెలిపించాలని ప్రచారం!

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని కామెంట్స్ చేశారు.

Addanki Dayakar: ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అద్దంకి.. ఆ నేతను గెలిపించాలని ప్రచారం!
New Update

Addanki Dayakar: నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజుకి మద్దతుగా నెల్లూరు నర్తకి సెంటర్లో దళిత ఆత్మా గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

Also Read: ఎమ్మెల్యే రాచమల్లు నీచనికృష్టుడు.. చివరికి తల్లిని సైతం..

జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని కామెంట్స్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దళిత రిజర్వేషన్స్ తొలగిస్తారన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాజ్యాంగం పరిరక్షించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందేనని పేర్కొన్నారు.

Also Read: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..!

కలెక్టర్గ ఉన్న సమయం నుంచి రాజు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారని, ఎన్నో పధకాలుకు ఆయన రూపకర్త అని వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యునిగా ఉన్న కొప్పుల రాజుని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు.

#addanki-dayakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి