Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది.

New Update
Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్

Actress Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అనే విషయం తెలిసిందే. షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా నిత్యం ఏదొక పోస్ట్ పెట్టే ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ షూటింగ్ వల్ల కావచ్చని అనుకున్నారు. కానీ అసలు నిజియం ఏంటంటే, ఆమె ఓ ప్రమాదం బారిన పడిందట. ఈ విషయాన్ని రష్మిక తన లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది.

రష్మిక తన ఇన్ స్టా పోస్ట్ లో.." నెల రోజులుగా నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. నాకు చిన్న ప్రమాదం జరగడమే. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా. అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి, ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. నష్టాలు జరగొచ్చు.

Also Read : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

అసలు మనకు రేపు అనేదే ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే ప్రతిరోజు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. నేను మరో అప్‌డేట్ ఇస్తున్నా, ప్రస్తుతం ఎన్నో లడ్డూలు తింటున్నా" అని పేర్కొంది. అయితే తనకు జరిగిన ప్రమాదం గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

#actress-rashmika-mandanna
Advertisment
తాజా కథనాలు