ACB వలలో అవినీతి తిమింగళాలు.. రూ. 2. 50 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యారు..! శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి సబ్ రిజిస్టర్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. By Jyoshna Sappogula 20 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: శ్రీ సత్యసాయి జిల్లాలో ఏసీబీ వలలో ఇద్దరూ అవినీతి తిమింగళాలు దొరికారు. మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అదికారులు దాడులు నిర్వహించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన 8 ఎకరాల 32 సెంట్లు స్థలం రిజిష్టర్ చేయడానికి బేరం కుదుర్చుకున్నారు సబ్ రిజిస్టర్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా. రూ. 2,50,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వారిఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. #acb-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి