Viral News: మద్యం మత్తులో నడిరోడ్డు పై యువతి రచ్చ రచ్చ .. వీడియో వైరల్

హైదరాబాద్‌ హై వే పై ఈరోజు తెల్లవారుజామున ఓ యువతి మద్యం సేవించి నడిరోడ్డు పై వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఇందుకు సంబందించిన ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

Viral News: మద్యం మత్తులో నడిరోడ్డు పై యువతి రచ్చ రచ్చ .. వీడియో వైరల్
New Update

Viral News: హైదరాబాద్‌ నాగోల్‌లో నడిరోడ్డు పై ఓ యువతి, యువకుడు వీరంగం సృష్టించారు. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ మద్యం మత్తులో అటుగా వెళ్తున్న మార్నింగ్ వాకర్స్ పై బూతులతో రెచ్చిపోయారు. చేతిలో బీర్ బాటిల్, సిగరెట్ తో న్యూసెన్స్‌ క్రియేట్ చేశారు యువ జంట. నడి రోడ్డుపై తాగడమేంటని ప్రశ్నించిన పెద్దాయన పై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కనే కారు నిలిపి మార్నింగ్‌ వాకర్స్‌ తో గొడవ పడుతూ రెచ్చిపోయారు.

నడిరోడ్డు పై యువతి రచ్చ 

వీళ్ళు ఉపయోగించిన కారు రాధిక పగిడిపల్లి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారు పై 5 చలాన్లు పెండింగ్‌లో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న వారి పై సైతం దురుసుగా ప్రవర్తించింది ఆ యువతి.  వీడియో తీస్తారేంటి.. నువ్వు ఎవడివి రా..! నీ కుంది నా చేతిలో అంటూ ఇష్టానుసారంగా రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

Vishwambhara: విశ్వంభర అప్డేట్.. మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్ - Rtvlive.com

#viral-video
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe