Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళా ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిన్న సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) కలిసేందుకు ప్రయత్నించగా తమను పోలీసులు అడ్డుకున్నారని మహిళా ఆరోపించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వచ్చామని చెప్పింది. ఈ క్రమంలో తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారని తెలిపింది. పోలీసుల మీద నమ్మకం లేక ఆత్మహత్యాయత్నం చేశామని ఆ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది.
రాజమండ్రిలో తనకు సంక్రమించిన 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని సదరు మహిళా ఆరోపించింది. రాజమండ్రిలో ఓ మహిళా (Rajahmundry Women) కార్పొరేటర్ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని స్థలాన్ని కబ్జా చేశారని తెలిపింది. అధికారులను వైసీపీ నేతలను కలిసిన తమకు న్యాయం జరగలేదని చెప్పింది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయాలని అనుకున్నామని పేర్కొంది.