స్కూల్లో స్నేహితుడి మెడ కోసిన 1వ తరగతి విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడు బ్లేడ్ తో తన స్నేహితుడి మెడ కోసిన భయంకరమైన ఘటన బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని బహేడీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్న విషయంలో గొడవ మొదలవగా విచక్షణ కోల్పోయిన విద్యార్థి ఈ దారుణాకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. By srinivas 26 Dec 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలోనూ క్రూరత్వం పెరిగిపోతుంది. పట్టుమని పదేళ్ల వయసుకూడా లేని బాలలే హత్యలకు పాల్పడుతున్న సంఘనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. స్కూల్ తదితర ప్రాంతాల్లో స్నేహితులుగా ఉంటూనే చిన్న చిన్న విషయాల్లో గొడవపడి దాడులు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ఇగోను తృప్తి పరుచుకునేందుకు విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రీ ప్రైమరీ చదువుతున్న ఓ పిల్లవాడు తనతో చదువుతున్న స్నేహితుడినే చంపాలనుకున్న భయంకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి : Hyderabad : ఎస్ఆర్నగర్ లో డ్రగ్స్ దందా.. 25మందిని పట్టుకున్న పోలీసులు ఈ మేరకు పాఠశాల యాజమాన్యం, పోలీసులు, పేరెంట్స్ చెప్పిన వివారాలు ఇలా ఉన్నాయి. బిహార్ దర్భంగా జిల్లాలోని బహేడీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఓ చిన్న విషయంలో గొడవపడ్డారు. అది కాస్త నెమ్మదిగా పెరిగడంతో కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో ఆరేళ్ల బాలుడు తన వెంట తెచ్చుకన్న బ్లేడుతో స్నేహితుడి దాడిచేశాడు. శరీరంపై గాట్లు పెట్టడంతోపాటు అతని మెడపై బ్లేడ్ తో దాడి చేశాడు. దీంతో ఆ పిల్లవాడి గొంతు తెగి చాలా రక్తం కారింది. వెంటనే అప్పమత్తమైన టీచర్స్ బాధితుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భంగా మెడికల్ కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించాక బాలుడిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారని, ఈ గొడవకు కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. #6-year-old-boy #friends-throat #bihar #cut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి