AP: పాపం తల్లి.. కుమారుడి మోసం భరించలేక..!

ప్రకాశం జిల్లా మార్కాపురంలో కుమారుడు మోసం చేశాడని పొలీస్‌ స్టేషన్ మెట్లెక్కింది ఓ తల్లి. ఉన్న ఇంటిని కొడుకు తన పేరున రాయించుకుని.. రాచి రంపాన పెడుతున్నారని కొడుకు - కోడలుపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

AP: పాపం తల్లి.. కుమారుడి మోసం భరించలేక..!
New Update

Ongole: కన్నతల్లి రుణం ఏ మాత్రం తీర్చలేనిది. కని, పెంచి, పోషించి, ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తల్లికి ఎంత చేసిన, ఏమీ చేసినా తక్కువే అవుతుంది. అలాంటి కన్నతల్లిని ఆస్తి కోసం ఇంటి నుండి గెంటేశాడు ఓ కసాయి కొడుకు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది.

Also Read: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి చావ బాదారు..!

ఉన్న ఇంటిని తన పేరున రాయించుకుని.. కన్న తల్లినే ఇంటి నుండి వెళ్లగొట్టాడు ఓ పుత్రరత్నం. దీంతో ఇక చేసేదేమి లేక బాధిత తల్లి పోలీసులను ఆశ్రయించింది. కుమారుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఆ తల్లి. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకోంది. చిత్రహింసలు పెడుతూ.. కొడుకు - కోడలు తనను రాచి రంపాన పెడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేసింది. బాధను దిగమింగుకొని కాలం వెళ్లదీస్తున్నానని ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతం అయింది.

#ongole
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి