Crime News: వేరే మతస్తుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..

కర్ణాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. వేరే మతస్తుడిని ప్రేమించిందనే కోపంతో సొంత చెల్లినే చెరువులోకి నెట్టేశాడు ఓ అన్న. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా చెరువులో పడి ఊపిరాడక మృతి చెందింది.

Crime News: వేరే మతస్తుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..
New Update

Crime News: మత పిచ్చి ఎన్ని దారుణాలకు కారణం అవుతుందో కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఘటన చూస్తే అర్దం అవ్తుంది. వేరే మతస్తుడిని ప్రేమించిందని కోపంతో తోబుట్టువునే చెరువులోకి తోసి చంపేశాడు ఓ అన్న. కూతురిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. మైసూరులో జరిగిన ఈ ఘటన స్ధానికంగా  సంచలనం రేపుతోంది .

Also Read: హిట్ అండ్ రన్ కేసులో సాఫ్ట్ వేర్ బ్యాచ్..!

మైసూరు జిల్లా మరూరుకు చెందిన 19ఏళ్ల ధనుశ్రీ బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో హనగోడుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి కనిపించడంతో..అతనితో స్నేహం వద్దంటూ చెల్లిని పలుమార్లు హెచ్చరించాడు అన్న నితిన్‌. ఐనప్పటికీ అతనితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది ధనుశ్రీ. దీంతో రగిలిపోయిన నితిన్‌..చెల్లిని ఎలాగైనా చంపాలని ప్లాన్‌ వేశాడు. బంధువులెవరికో ఆరోగ్యం బాలేదంటూ చెల్లితో పాటు తల్లిని కూడా బయటకు తీసుకెళ్లాడు.

Also Read: ఎక్కడికి వస్తారో రండి.. చేసిన అభివృద్ధిని చూపిస్తాం.. షర్మిలకు అమర్నాథ్ కౌంటర్

ఈ నేపథ్యంలో చెల్లితో మరోసారి గొడవ జరిగింది. పట్టరాని కోపంతో చెల్లి చేతులను కట్టేసి చెరువులోకి నెట్టేశాడు. దీంతో కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. ఐతే తల్లిని కాపాడుకునేందుకు నితిన్‌ నీటిలోకి దూకినా ప్రయోజనం లేకుండా పోయింది. చెల్లితో పాటు తల్లి చెరువులో గల్లంతయింది. విషయం తెలుసుకున్న పోలీసులు..గజ ఈతగాళ్లను రంగంలోకి దించి తల్లీ కూతుళ్ల డెడ్‌బాడీస్‌ను బయటకు తీశారు. నితిన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

#crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe