స్కూల్ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యంపై చర్చ ఈనాటికి కాదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట స్కూల్ బస్సుల ప్రమాదాలపై ఏదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ(Telangana)లో ఈ ఒక్క రోజే(ఆగస్టు 2) రెండు బస్సు ప్రమాద ఘటనలు వెలుగుచూడడం కలకలం రేపింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి(bachupally)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8ఏళ్ల చిన్నారి చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. స్కూటీపై తన తండ్రితో కలిసి స్కూల్కి వెళ్తున్న దీక్షితను భాష్యం స్కూల్కి చెందిన బస్సు ఢీకొట్టింది. స్కూటీ వెనకసీటులో కూర్చున్న దీక్షిత(deekshitha) వెంటనే కిందపడిపోయింది. అప్పుడు కూడా బస్సు డ్రైవర్ బ్రేక్ కొట్టలేదు. దీంతో బస్సు పాపపై నుంచి వెళ్లిపోవడంతో బాడీ మొత్తం నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్(bus driver)ని రహీంగా గుర్తించారు పోలీసులు. అతను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే దీక్షిత చనిపోయిందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8ఏళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందింది. భాష్యం స్కూల్కి చెందిన బస్సు స్కూటీపై తన తండ్రితో కలిసి వెళ్తున్న దీక్షితను ఢీకొట్టింది. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్లాడ శివారులోని పొలాల్లోకి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8మందికి విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
Translate this News: