Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల

లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. డిజైన్‌ టెక్‌ ద్వారా కోట్లు కొట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. మొత్తం 4 కేసులో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. స్కామ్‌ లో ఈ ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని వ్యాఖ్యనించారు.

New Update
Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ ప్రజాస్వామ్యానికే పెద్ద విఘాతం అన్నట్లు టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మంత్రి సజ్జల(Sajjala) రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. స్కిల్ స్కామ్‌ లో ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. డిజైన్‌ టెక్‌ ద్వారా కోట్లు కొట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. మొత్తం 4 కేసుల్లో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. స్కామ్‌ లో ఈ ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని వ్యాఖ్యనించారు. ప్రజాధనం దోపిడీకి గురైందని దర్యాప్తు చేసి సీఐడీ ఆధారాలు సమర్పించిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో టీడీపీ నారా లోకేష్(lokesh) తోపాటు తెలుగు దేశం పార్టీ శ్రేణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఆందోళనలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని సజ్జల అన్నారు. టీడీపీ నేతలు అసలు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌ గురించి  ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. స్కామ్‌ పై అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అని సజ్జల ప్రశ్నించారు. అంతే కాకుండా, లోకేష్‌ అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ? ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారని.. ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, టీడీపీని నడిపే బాధ్యత కూడా ప్రజలదేనని ఆ పార్టీ లీడర్స్ అనడం సిగ్గుచేటని సజ్జల విమర్శించారు.

ఇన్నర్‌ రింగ్ ప్రాజెక్టులోనూ చంద్రబాబు అక్రమాలు చేశారని సజ్జల ఆరోపించారు. అన్ని కుంభకోణాల్లోనూ కిలారు రాజేశ్‌ది కీలకపాత్ర అని తెలిపారు. అమరావతి భూముల స్కామ్‌ లోనూ చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. అసైన్డ్ భూములు లాక్కొని పేదల కడుపుకొట్టారిని మండిపడ్డారు. వీటన్నింటికి చంద్రబాబే సూత్రధారని.. మిగతా వాళ్లు సహకరించారని సజ్జల ఆరోపించారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని టీడీపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు సజ్జల.

Also Read:  ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు