Kadapa: కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత.!

కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. తన అనుచరవర్గంతో వైసీపీలో చేరేందుకు సాయినాథశర్మ ప్రయాత్నాలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Kadapa: కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత.!
New Update

Tension in Ramapuram: కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా సాయినాథ శర్మ టీడీపీకి దూరంగా ఉంటున్నారని సమాచారం.

Also Read: జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!

తాజాగా, పెద్ద చెప్పలి గ్రామంలో అత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీలో చేరేందుకు సాయినాథశర్మ అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అత్మీయ సమావేశాన్ని అడ్డుకునేందుకు సాయినాథశర్మ అనుచరులను ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు తీసుకెళ్లారు.

Also Read: మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి..

కాగా.. తన అనుచరులను పరామర్శించేందుకు పెద్దచెప్పలి వెళ్లిన సాయినాథ్ శర్మపై ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటన స్థలంకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

#kadapa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe