Maha Ganapathi Shobha Yatra: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం అవనుంది. కొద్దిసేటి క్రితం 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేయనున్నారు. తర్వాత ఈరోజే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్పైకి మహా గణపతి ఎక్కిస్తారు. రేపు మధ్యాహ్నం హుస్సేన్సాగర్లో ఉన్న క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుస్తారు. మొత్తం 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు రేపు నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నాయి.రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. రేపంతా సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. అలాగే రేపు తాగేసి నిమజ్జానికి వచ్చి రచ్చ రచ్చ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు సీపీ.
Also Read: Tripura: పాకిస్తాన్..క్యాన్సర్ లాంటిది..మళ్ళీ నోరు పారేసుకున్న యోగి ఆదిత్యనాథ్