Amit shah visit: అమిత్‌షా వస్తున్నారు... షెడ్యూల్ ఇదే..!

అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. 17న విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్నారు. 16న రాత్రి 8 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్ షా.. సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ మెస్‌లో బస చేయనున్నారు. సభ తర్వాత ఢిల్లీకి కేంద్ర హోంమంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. పార్టీ బలోపేతంపై నేతలతో మంతనాలు జరిపారు.

Telangana BJP-Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
New Update

సెప్టెంబర్ 17న ఇక్కడ జరిగే తెలంగాణ 'విమోచన దినోత్సవం' వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రం నిర్వహించనుంది. అప్పటి హైదరాబాద్ స్టేట్ సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. నిజానికి గతేడాది కూడా అమిత్‌షా మీటింగ్‌కి వచ్చారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఇక్కడ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది. గతేడాది ఆ సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది కూడా అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని.. ఇదే ఈవెంట్‌ నిర్వహిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెన్‌షియల్‌ రిట్రీట్‌లలో మరో కార్యక్రమం జరగనుండగా.. రాష్ట్రపతి ముర్ము వర్చువల్‌గా హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరవుతారు.

అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. 17న విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్నారు.

16న రాత్రి 8 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్ షా.. సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ మెస్‌లో బస చేయనున్నారు. సభ తర్వాత ఢిల్లీకి కేంద్ర హోంమంత్రి

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. పార్టీ బలోపేతంపై నేతలతో మంతనాలు జరిపారు.



కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి ఫైర్:

ప్రభుత్వం అధికారికంగా 'విమోచన దినోత్సవం' (సెప్టెంబర్ 17) జరపడంలేదని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. రోశయ్య విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని అప్పుడు కేసీఆర్‌ విమర్శలు గుప్పించారని.. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఐఎంఐఎం కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గతేడాది కేంద్రం ప్రకటించడంతో సీఎం కలవరపడ్డారని.. ఆ రోజును 'జాతీయ సమైక్యతా దినోత్సవం'గా పాటిస్తామని గతంలో ప్రకటించారన్నారు.

గతేడాది సెప్టెంబరు 17న కేంద్రం నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై కూడా రెడ్డి మండిపడ్డారు. 'ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అనుమతి ఇవ్వకపోవడంతో గతేడాది కేసీఆర్‌ హాజరు కాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమం మతపరమైన సమస్య కాదని, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారి ఆకాంక్షలకు, చరిత్రకు సంబంధించిన సమస్య అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అన్నారు.

ALSO READ: ప్లీజ్ అలా ప్రచారం చేయకండి.. ఆ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

#amit-shah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe