Senior Actor Rajasekhar : ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ తమ నివాస ప్రాంతమైన జూబ్లీహిల్స్లోని డ్రైనేజీ లీకేజీ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నోసార్లు జీహెచ్ఎంసీని ఆదుకోవాలని కోరినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో.. "జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని అశ్విని హైట్స్ వద్ద డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్లుగా వేధిస్తోంది.
జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫోటోను పోస్ట్ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ లను ట్యాగ్ చేశారు. దీంతో రాజశేఖర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : పాపం.. సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న కుర్చీ తాత.. వీడియో వైరల్
ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆయన కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరూ టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.