Sakshi Malik: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్

రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ కు స‌న్నిహితుడైన సంజ‌య్ సింగ్ విజ‌యంతో ఆమె కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చారు. 

New Update
Sakshi Malik: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్

Sakshi Malikh: రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ కు స‌న్నిహితుడైన సంజ‌య్ సింగ్ విజ‌యంతో ఆమె కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చారు.

మహిళా రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించినట్లు భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. తామంతా 40 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నా చేస్తే దేశమంతా తమకు తోడుగా నిలిచిందని, అయినా, అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోవడం బాధ కలిగించిందని చెప్తూ సాక్షి భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి గెలిచారంటూ సాక్షి మాలిక్ కంట నీరు పెడుతూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.


కాగా, రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా సంజ‌య్ సింగ్ ఎన్నికతో దేశంలో ఆ క్రీడ భ‌విష్యత్తును అంధ‌కారంలోకి తీసుకెళ్లిందన్నారు వినేశ్ పోగాట్. అయితే సంకల్ప బలాన్నే నమ్ముకున్న త‌మ‌కు తప్పక న్యాయం జ‌రుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.

Advertisment
తాజా కథనాలు