బీ కేర్ ఫుల్..ఏపీ ప్రజలకు మంత్రి సజ్జల హెచ్చరిక.!

‘బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే టీడీపీ కార్యక్రమంపై మంత్రి సజ్జల కౌంటర్లు వేశారు. పచ్చ దొంగల ముఠా ఇళ్లలోకి చొరబడుతోంది..ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..అంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గ్యారెంటీ కార్డ్ ఇచ్చి ఐదు కోట్ల మందిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

Sajjala: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!
New Update

Minister sajjala: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ రాబోయే కాలంలో ప్రజలు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదని అంటున్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రచారిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంటున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..?

అయితే, టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు. పచ్చ దొంగల ముఠా ఇళ్లలోకి చొరబడుతోంది.. జాగ్రత్త అంటూ అలర్ట్ చేస్తున్నారు. ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కూపన్లు టీడీపీ పంచుతోందని తెలిపారు. 2024 జూన్ నుంచి డబ్బులు అక్కౌంట్ లో వేస్తామని ప్రచారం చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో రాతపూర్వకంగా ఇవ్వచ్చు ..తప్పులేదు..కానీ, ప్రజల దగ్గరకు వెళ్లి డబ్బులు వచ్చేసాయి అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సజ్జల. ఇలాంటి వారిని ఏ విధంగా శిక్షించాలి? అని వ్యాఖ్యనించారు. ఒక అంతర్జాతీయ నేరస్తుల ముఠాకు టీడీపీ నేతలకు ఏమైనా తేడా ఉందా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని..గ్యారెంటీ కార్డ్ ఇచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ..ప్రజల డేటా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

#sajjala-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe