Major Road Accident at Paderu: ఘోర రోడ్డు ప్రమాదం.. పాడేరులో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చెట్టుని తప్పించబోయి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మోదమాంబ పాదాలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Major Road Accident at Paderu: ఘోర రోడ్డు ప్రమాదం.. పాడేరులో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

Major Road Accident at Paderu: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చెట్టుని తప్పించబోయి లోయలో పడింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పది మంది పరిస్థితి విషమంగా ఉంది. అలాగే 35 మంది ప్రయాణికులు చికిత్స తీసుకుంటున్నారు.

మోదమాంబ పాదాలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చెట్టు కొమ్మను తప్పించబోతుండగా అదుపుతప్పి బస్సు లోయలోకి దూసుకుపోయింది.

సుమారు బస్సు 100 అడుగుల లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిప్పుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. paderu road accident

Advertisment
తాజా కథనాలు