సోషల్ మీడియోలో ట్రెండవుతున్న "JioBoycott" హ్యాష్‌ట్యాగ్!

ప్రస్తుతం"#JioBoycott" అనే హ్యాష్‌ట్యాగ్‌ X లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 40వేలకు పైగా పోస్ట్ లను జియో వినియోగదారులు షేర్ చేస్తున్నారు. చాలా మంది JIO, Airtel, Vi కంటే తక్కువ ధరకు సేవలను అందించే BSNL వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.

New Update
సోషల్ మీడియోలో ట్రెండవుతున్న "JioBoycott" హ్యాష్‌ట్యాగ్!

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, 3 ప్రధాన టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను ఏకకాలంలో పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ అధిక ధరల పెంపు భారత టెలికాం వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీసింది.దీంతో జియో వినియోగదారులు "#JioBoycott" అనే హ్యాష్‌ట్యాగ్‌ని  X లో ట్రెండ్ చేస్తున్నారు. 40వేలకు పైగా పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. మూడు కంపెనీల కంటే తక్కువ ధరకు సేవలను అందించే BSNLని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు.

రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ కొన్ని సరసమైన ప్లాన్‌ల నుండి 'అపరిమిత 5G' సేవను తొలగించాయి. మునుపటి ప్లాన్‌లోనే తమ రోజువారీ డేటా అవసరాలను తీర్చుకుంటున్న మొబైల్ డేటా వినియోగదారులు ఇకపై దాన్ని ఉపయోగించలేరు. అయితే ఇప్పుడు అదే డేటా ప్లాన్ ఎక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది. "JioBoycott" అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు, నెటిజన్లు "BSNLkigharwapsi" అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

దీంతో BSNLకి  మద్దతు పెరుగుతుంది. మూడు కంపెనీల రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల సర్వీస్ ప్లాన్‌లతో పోలిస్తే ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL సర్వీస్ ప్లాన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Xలోని వినియోగదారులు BSNLకి మారడానికి 5G కనెక్షన్‌లను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

BSNL ప్లాన్ రూ.199తో 30 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. మరోవైపు, ఎయిర్‌టెల్ నెలకు రూ. 379 రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2GB డేటాను అందిస్తోంది. అలాగే రిలయన్స్ జియో రూ.349తో 28 రోజుల పాటు 2జీబీ డేటా ప్లాన్‌ను అందిస్తోంది.

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ,వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను రూ.600 వరకు పెంచాయి. ఎయిర్‌టెల్  జియో రెండింటి  వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు భారీ ధరలను పెంచాయి. ముందుగా రూ.2,999గా ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ.3,599కి పెరిగింది ధరల పెంపుదల ఇందుకు కారణమని కంపెనీలు పేర్కొన్నాయి. ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయాన్ని (ARPU) కొనసాగించేందుకు ధరల పెంపు తప్పనిసరి అని వారు చెప్పారు. కొత్త ఛార్జీలు జూలై 3 నుండి Airtel ,Jio  జూలై 4 నుండి Vodafone Ide లకు అమలులోకి వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు