Isro Update on Mission Gaganyaan: చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇస్రో సైంటిస్టుల ఫోకస్ అంతా గగన్యాన్ మిషన్పైనే ఉంది. గగన్యాన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది దేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర. ఈ మిషన్ భారత్కు చాలా ప్రత్యేకం. ఈ మిషన్ సక్సెస్ అయితే అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ ఫీట్ సాధించిన నాల్గొ దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఇస్రో నుంచి ఓ కీలక్ అప్డేట్ వచ్చింది. గగన్యాన్ మిషన్లో ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్యాన్ మిషన్కు చెందిన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధంగా ఉందని ట్వీట్ చేసింది.
చెప్పిందే చేస్తున్నారు:
భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ సోమనాథ్ ఈ ఏడాది ప్రారంభంలోనే తమ టార్గెట్ ఏంటో చెప్పారు. 2024ను గగన్యాన్కు సన్నాహక సంవత్సరంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనే హెలికాప్టర్ నుంచి డ్రాప్ టెస్ట్ కూడా నిర్వహిస్తామన్నారు. ఇందులో పారాచూట్ వ్యవస్థను పరీక్షిస్తారు. ఇలాంటి అనేక డ్రాప్ పరీక్షలు నిర్వహించిన తర్వాత పలు వాల్యుయేషన్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జీఎస్ఎల్వీని కూడా ప్రయోగిస్తామని సోమనాథ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కనీసం 12 మిషన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చీఫ్ చెప్పారు. హార్డ్వేర్ లభ్యతను బట్టి ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు సోమనాథ్.
గగన్యాన్ మిషన్ అంటే ఏమిటి?
మానవులను అంతరిక్షంలోకి పంపడమే గగన్యాన్ మిషన్ ప్రధాన లక్ష్యం. ముగ్గురు వ్యక్తుల బృందాన్ని అంతరిక్షంలోని భూమి కక్ష్యలోకి పంపుతారు. తర్వాత వారు సురక్షితంగా భూమిపైకి తిరిగి రావాలి. ఈ మిషన్ను 2025లోపు పూర్తి చేయాలన్నది ఇస్రో టార్గెట్. నిజానికి 2022లోనే ఇది పూర్తికావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది ఆలస్యం అయింది.
Also Read: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి..
WATCH: