Minister Ambati: ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది?: మంత్రి అంబటి

ప్రజాగళం ప్రజలకు ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిందో అందరికీ తెలుసన్నారు. ముగ్గురు కలసి పోటీ చేసినా సీఎం జగన్ ను ఓడించలేరని వ్యాఖ్యానించారు.

Ambati: టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..!
New Update

Minister Ambati: మూడు పార్టీలు కలసి పోటీ చేసినా సీఎం జగన్ ను ఓడించలేవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాగళం సభలో మైకు మూగబోతే దానికి పోలీసులు కారణమని సాకులు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాగళం సభ ద్వారా ప్రజలకు ఏం సందేశమిచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతోనే సరిపోయిదన్నారు. సోషల్ మీడియాలో సైతం తనదైన శైలిలో కూటమిపై మంత్రి అంబటి కౌంటర్లు వేస్తున్నారు.

#minister-ambati-rambabu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe