Mallareddy university: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. అనుమానస్పద రీతిలో విద్యార్థి మృతి!

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అరుణ్ కుమార్.. తరగతి గదిలోనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయి అనుమానస్పదరీతిలో మరణించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Mallareddy university: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. అనుమానస్పద రీతిలో విద్యార్థి మృతి!
New Update

Hyderabad: హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న అరుణ్ కుమార్ (19) అనే విద్యార్థి అనుమానస్పదరీతిలో మరణించారు. గురువారం తరగతి గదిలోనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు అరుణ్‌ కుమార్. గమనించిన వెంటనే తోటి విద్యార్థులు, సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుంగా అప్పటికే చనిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతోనే అరుణ్‌ చనిపోయాడని, సరైన సమయానికి హాస్పిటల్ వెళ్తే బతికేవాడంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అరుణ్‌ మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

#mallareddy-agri-culture-university #student-arunkumar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe