Amitab Bachchan: ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడిఫ్ చాట్ లో పాల్గొన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ కుమార్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన 'ఖాకీ' చిత్రీకరణ సమయంలో ఐశ్వర్య రాయ్ కి జరిగిన ప్రమాదం గురించి గుర్తుచేసుకున్నారు.
రెండు రోజులు నిద్ర పట్టలేదు
అమితాబ్ మాట్లాడుతూ.. "2023 నాసిక్లో 'ఖాకీ' షూటింగ్లో జరిగిన ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. షూట్ లో స్టంట్మ్యాన్ కారుతో స్టెంట్ చేస్తుండగా అది అదుపు తప్పి ఐశ్వర్య కూర్చున్న కుర్చీ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తలరించాము. ఆ తర్వాత ఐశ్వర్యను తిరిగి ముంబై తీసుకెళ్లడానికి అనిల్ అంబానీ ప్రైవేట్ విమానం ఏర్పాటు చేశాము. కానీ నాసిక్లో నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడంతో.. ఆసుపత్రికి 45 నిమిషాల దూరంలో ఉన్న సైనిక స్థావరంలో విమానాన్ని ల్యాండ్ చేశాము. దాని కోసం ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. కానీ.. అప్పుడు అందరూ ఈ ప్రమాదాన్ని చాలా చిన్న సంఘటనగా కొట్టివేశారు. ఆమెకు తగిలిన గాయాలు చూసి ఎంతో కలత చెందాను. రెండు రోజులు నిద్ర పట్టలేదు. ఆమె వీపు వెనుక భాగంలో, కాళ్ళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పాదం ఎముక విరిగిపోయింది. ఇందంతా నా కళ్ళ ముందే జరిగింది. ఈ సంఘటన మర్చిపోవడానికి చాలా రోజులే పట్టింది అని ఎమోషనల్ అయ్యారు.
ఇది ఇలా ఉంటే కొంతకాలంగా ఐశ్వర్య రాయ్ ప్రతీ ఈవెంట్ లో ఒంటరిగా లేదా తన కుమార్తెతో మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఐశ్వర్య- అభిషేక్ మధ్య విభేదాలు వచ్చాయా? లేదా వారు విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ నెట్టింట అనేక పుకార్లు వస్తున్నాయి. అయితే వీటిపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కానీ స్పందించలేదు. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ను ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది.