Crime News : కీచక టీచర్ బాగోతం.. విద్యార్థులకు వేధింపులు..!

కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్ లో కీచక టీచర్ బాగోతం బయటపడింది. తమ పిల్లలను గిచ్చుతూ, గిల్లుతూ, శరీరాన్ని తడుముతూ వేధిస్తున్నాడని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో ఆ దుర్మార్గుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Crime News : కీచక టీచర్ బాగోతం.. విద్యార్థులకు వేధింపులు..!
New Update

Khammam : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే (Teacher) విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణమైన ఘటన కొత్తగూడెం సింగరేణి హైస్కూల్‌ (Singareni High School) లో చోటుచేసుకుంది. తెలుగు టీచర్‌ వేణు వికృత చేష్టలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులతో టీచర్‌ వేణు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గిచ్చుతూ, గిల్లుతూ, శరీరాన్ని తడుముతూ వేధింపులకు గురిచేస్తున్నాడని తల్లితండ్రులతో పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

ఉపాధ్యాయుడి వేధింపులపై తీవ్ర ఆగ్రహానికి లోనైన విద్యార్థినిల తల్లితండ్రులు స్కూల్‌కొచ్చి గొడవ పడ్డారు. టీచర్‌ వేణును తమకు అప్పగించాలని ఆందోళన చేశారు. వేణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగు టీచర్‌ వేణును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

#khammam #telugu-teacher
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe