TDP: 'అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వను'.. కేసినేని నాని కీలక వ్యాఖ్యలు.!

మరోసారి బుద్దా వెంకన్నపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసినేని నాని. కాల్ మనీ సెక్స్ రాకెట్లు, భూకబ్జాలు, అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. విజయవాడ ఎంపీగా నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తికి అవకాశం ఇస్తేనే సపోర్ట్ చేస్తానన్నారు.

New Update
BIG BREAKING: తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా!

Kesineni Nani's comments: విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని.. బుద్దా వెంకన్నపై మరొసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బీసీ నేతకు అవకాశం ఇవ్వాలన్న చర్చపై కేశినేని నాని మాట్లాడుతూ.. నీతి నిజాయతీతో పనిచేసే వారికి సీటు ఇస్తేనే తన మద్దతు తెలుపుతారన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు, భూకబ్జాలు చేసే వారికి సపోర్ట్ చేయనిన అన్నారు. అలాంటి బీసీలు పార్టీకి అవసరం లేదన్నారు. టిడిపికి అండగా ఉండే బీసీలే అవసరమన్నారు. విజయవాడ ఎంపీగా.. క్యారెక్టర్ ఉన్న నిరుపేద బీసీలకు అవకాశం ఇస్తే కాళ్ళకు దండం పెట్టి మద్దతు తెలుపుతాను కానీ, అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు.

Also Read: ఏపీలో పాతమిత్రులు మళ్లీ కలుస్తారా!.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఓకే చెప్పిందా!

బీసీలంటే నీతి నిజాయితీతో పనిచేసే వారని, అలాంటి వారిలో విజయవాడ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఒకరని కొనియాడారు. గోగుల రమణ మేయర్ గా నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచారని పేర్కొన్నారు. ఎంపీ సీటులో ఈసారి బీసీ అభ్యర్ధికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీలో జరుగుతున్న చర్చను సిట్టింగ్ కేశినేని నాని బయటపెట్టారు.

ఇదిలా ఉండగా..వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఏపీలో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొత్త కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కులాల కుంపట్లతో సాగే ఏపీ రాజకీయాల్లో ఈసారి టికెట్లు ఏ కులానికి ఇవ్వాలన్న దానిపై జరుగుతున్న చర్చలో విజయవాడలోనూ బీసీ అభ్యర్ధి చర్చ తెరపైకి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు