కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడుతుంటే..కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు ఉపయోగపడుతున్నాయని భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగులు రాష్ట్రాన్ని అపుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ ఓటమి పక్కా అని సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పేందుకే రాహుల్ గాంధీ పర్యటన అని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమున్నాయో వివరించారు. ప్రజల సొమ్ము..దొరల పాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీవీతో గండ్ర సత్యానారాయణ చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
Gandra Satyanarayana Rao: మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశావ్...నీ ఓటమి పక్కా..ఆర్టీవీతో గండ్ర సత్యనారాయణ రావు..!!
New Update