Ap Crime : ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్‌ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.

New Update
Mali: దారుణం..దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి!

AR Constable : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) లో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్‌ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ పాత ఈవీఎం (Old EVM's) లు నిల్వ చేసిన గోడౌన వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా మద్యానికి బానిసైన ప్రసాద్‌...ఇంటి ఖర్చులకు కానీ ఇతర అవసరాలకు కానీ జీతం డబ్బులు ఇవ్వడం లేదు.

ఈ నేపథ్యంలోనే ప్రసాద్ కుమారుడు శేష కమల్ డ్యూటీలో ఉన్న తండ్రి వద్దకెళ్లి ఏటీఎం కార్డు అడగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ప్రసాద్.. శేష కమల్ ని తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతి భాగంలో కాల్చాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శేషకమల్ ని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు.

అయితే అప్పటికే శేష కమల్ చనిపోయినట్లు రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ (AR Constable Prasad) ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ పరిశీలించారు.

Also read: తెలంగాణలో లెక్కలు తలకిందులు.. ఇండియా టుడే సంచలన సర్వే!

Advertisment
తాజా కథనాలు