Actress Poonam Kaur: దర్శకుడు త్రివిక్రమ్, నటి పూనం కౌర్ గొడవ చాలా ఏళ్ళుగానే నాగుతోంది. పూనమ్ దర్శకుడి మీద చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంతో మరోసారి సంచలన ట్వీట్ చేసింది నటి. దర్శకుడు త్రివిక్రమ్ని ప్రశ్నించాలని...సినీ పరిశ్రమ పెద్దలను కోరుతున్నానంటూ పూనం అందులో రాసింది. గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవ్వరూ సహకరించలేదని చెప్పింది. అంతేకాదు రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూతో రచ్చ అయి టాలీవుడ్లో పూనం ట్వీట్తో ప్రకంపనలు వచ్చాయి.
పూనమ్ కౌర్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్, పవన్ కల్యాణ్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఛాన్స్ దొరికితే చాలు వారిద్దరినీ విమర్శిస్తూ వచ్చింది. అసలు వాళ్ళిద్దరికీ, పూనమ్ కౌర్కూ మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఎప్పుడో త్రివిక్రమ్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసానని చెపుతోంది పూనమ్. అంతలా ఆయన ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పుడు పూనమ్ ట్వీట్తో అప్పుడు "మా" ఎందుకు స్పందించలేదు? త్రివిక్రమ్పై ఫిర్యాదు తీసుకోకుండా అడ్డుకున్నదెవరు? అంటూ ప్రశ్నలు బయలుదేరాయి.
Also Read: Myanmar: మయన్మార్లో ప్రకృతి బీభత్సం..226మంది మృతి