Hyderabad:హైదరాబాద్ లో దారుణం..నవ వధువు కళ్లకు గంతలు కట్టి అత్యాచారానికి పాల్పడ్డ దొంగ బాబా!

మళ్లీ హైదరాబాద్ లో మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు పెరుగుతున్నాయి. రోజుకో అత్యాచార సంఘటన చోటుచేసుకుంటుంది. ఒక దారుణాన్ని మర్చిపోక ముందే మరో దారుణం జరుగుతుండడంతో జనం బంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఎల్బీ నగర్ లో మహిళపై పోలీసుల దాడి అదే విధంగా నానక్ రామ్ గూడలో మహిళ పై అత్యాచారం చేసి దారుణంగా హత మార్చిన సంఘటనలు మర్చిపోక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది

New Update
Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు!

Hyderabad:మళ్లీ హైదరాబాద్ లో మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు పెరుగుతున్నాయి. రోజుకో అత్యాచార సంఘటన చోటుచేసుకుంటుంది. ఒక దారుణాన్ని మర్చిపోక ముందే మరో దారుణం జరుగుతుండడంతో జనం బంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఎల్బీ నగర్ లో మహిళపై పోలీసుల దాడి అదే విధంగా నానక్ రామ్ గూడలో మహిళ పై అత్యాచారం చేసి దారుణంగా హత మార్చిన సంఘటనలు మర్చిపోక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బండ్లగూడలో ఓ నకిలీ బాబా నవవధువు పై దారుణానికి తెగబడ్డాడు. ఇక వివరాల్లోకి వెళితే.. ఓ నవవధువుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమె అత్తామామలు ఆమెను బాబా దగ్గరికి తీసుకెళ్లారు. అయితే నవవధువు పై కన్నేసిన ఆ దొంగ బాబా వాళ్ల అత్తమామలకు మాయమాటలు చెప్పి ట్రీట్మెంట్ పేరుతో పక్క గదిలోకి తీసుకొని వెళ్లాడు. అక్కడ నవవధువు కళ్లకు గంతలు కట్టి ఆమె పై దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు అత్తమామలకు చెప్పింది. ఈ లోగా దొంగ బాబా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇక బాధితురాలితో అత్తమామలు స్థానిక పోలీసు స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో మళ్లీ కొన్ని రోజుల నుంచి మహిళలపై అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతండడం ఆందోళనకరంగా మారింది.

ఇది కూడా చదవండి: 800 పెంచి 200 తగ్గించడం..ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే!!

Advertisment
తాజా కథనాలు