Crime News: హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్ హనుమకొండ జిల్లా భీమారంలో దారుణం చోటుచేసుకుంది. శివానీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని బలవన్మరణం చెందింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16)గా గుర్తించారు. కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లు కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 08 Mar 2024 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Hanumakonda : హనుమకొండ జిల్లా భీమారంలో పండగపూట విషాదం నెలకొంది. శివానీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని బలవన్మరణం చెందింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16) గా గుర్తించారు. శివానీ కాలేజ్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాహిత్య కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లు కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. Also Read: రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..! మృతురాలి గదిలో సూసైడ్ నోట్ లభ్యమయినట్లు తెలుస్తోంది. తాను ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని..తనను డాక్టర్ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చలేకపోతున్నానని అందుకే సూసైడ్ చేసుకుంటానని పేర్కొంది. కూతురి మృతిపై సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటినా ఘటన స్థలంకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Also Read: పుష్ప2 సినిమాలో జాన్వీ కపూర్? ఆ స్పెషల్ సాంగ్ కోసమేనా? అయితే, తన కూతురి మరణంపై సాహిత్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లైతే చేతులు, కాళ్లు విరిగిపోవాలని.. కానీ, సాహిత్య చేయి ఎలా కట్ చేసుకుందని ప్రశ్నిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం హత్యను ఆత్మహత్యగా చిత్రకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూతురి మరణం వెనుక ఉన్న అసలు కారణం తెలియాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #hanumakonda-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి