AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..! ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. సీనియర్ నేత గంటా ప్రసాదరావు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్కు పంపించారు. By Jyoshna Sappogula 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Eluru: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు సైతం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత ఎంత సర్ది చెప్పినా.. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ జగన్కు షాక్లు ఇస్తున్నారు. Also Read: ఏపీని వీడని వాన గండం.. రాబోయే 24 గంటల్లో.. ఈ క్రమంలోనే తాజాగా, ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. జిల్లాలో సీనియర్ నేత అయిన గంటా ప్రసాదరావు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసి ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్కు పంపించారు. ఆయన భార్య గంటా పద్మశ్రీ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యభర్తలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. #ganta-prasada-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి