రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. పలు డివిజన్లలో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. కొన్ని పూర్తిగా రద్దు చేయగా..మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సూరారెడ్డిపాలం, ఒంగోళఉ, విజయవాడ సెక్షన్లలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటం కారణం. దీంతో 24 ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈనెల 12, 13,15,16,18,19 తేదీల్లో తిరుపతి పూరి ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే ఈనెల 13,14,15,17,18,20,21 తేదీల్లో పూరి తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో జరుగుతున్న పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడుతున్నట్లు తెలిపింది. ఈనెల 18 నుంచి 31 వరకు విశాఖ, మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు, విశాఖ, రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
Translate this News: