Hyderabad : తెలంగాణ(Telangana) లో కోటి రూపాయల విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లోని రోడ్డునెంబర్–71లోని నవనిర్మాణ్ నగర్లో నివసించే బాబ్జీ భాగవతుల అనే విశ్రాంత ఉద్యోగి తన భార్య తో కలిసి ఈ నెల 20న బెంగుళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport) కు వచ్చాడు.
పూర్తిగా చదవండి..Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్ మీదే అనుమానం!
జూబ్లీహిల్స్ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: