Nandyala: నంద్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గ్యాంగ్రేప్లో ముగ్గురు బాలురు పాల్గొన్నారు. మైనర్ బాలికను టెన్త్ క్లాస్ లోపే చదువుతున్నముగ్గురు బాలురు రేప్ చేశారు. పగిడాల మండలంలో బాలిక మిస్సింగ్పై కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి గ్యాంగ్రేప్ వచ్చింది. పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి.. మల్యాల లిప్ట్ కెనాల్లో ఆ బాలిక మృతదేహాన్ని పడేశారు. కాల్వలో బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు.
nandyala
Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?
Political Family War : సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే మే నెలలో నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర నంద్యాల(Nandyala) కు చేరుకుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ(TDP) నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సందడిగా ఆయన పాదయాత్ర సాగుతున్న వేళ.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) వర్గీయులు సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy) టార్గెట్ గా దాడికి దిగారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. రక్తం వచ్చేలా కొట్టారు. అఖిల ప్రియ సైతం ఆ దాడిలో పాల్గొన్నారు. ప్రత్యర్థులపైకి పరిగెత్తుతూ ఆమె వార్నింగ్ ఇస్తున్న దృష్యాలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు నంద్యాల పోలీసులు.
- 2019 ఎన్నికల సమయంలోనూ ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్ జరిగింది. సైకిల్ యాత్ర చేపట్టిన సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు.
- ఇది జరిగిన ఏడాదికి అంటే.. 2020 మార్చిలో కడప పోలీసులు బాంబ్ పేల్చారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త కుట్ర పన్నారని.. ఇందుకోసం ఓ గ్యాంగ్ కు రూ.50 లక్షలు సుపారీ ఇచ్చారంటూ నిందితులను చూపెట్టారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.
అయితే.. ఈ వరుస సంఘటనలు పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్ల నాటి శతృత్వం ఉందని అంతా భావిస్తారు. కానీ.. వీరు ఒకప్పుడు మంచి మిత్రులు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులు. ‘నేను, ఏవీ సుబ్బారెడ్డి నేను వేరు కాదు.. అలా అని ఎవరైనా భ్రమ పడితే వారి పొరపాటు’ అంటూ అనేక సార్లు స్వయంగా చెప్పారు నాగిరెడ్డి. వీరిద్దరూ బెంగళూరులో ఒకే రూమ్ లో ఉండి చదువుకున్నారు. తర్వాత వ్యాపారాలు చేశారు. నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయనకు అండగా ఉన్నారు ఏవీ సుబ్బారెడ్డి. గ్రూపు తగాదాల్లోనూ నాగిరెడ్డి పైచేయి సాధించడంతో ఏవీ సుబ్బారెడ్డి పాత్ర కీలకమని చెబుతుంటారు. తనకు అండగా నిలిచిన స్నేహితుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలని భావించిన నాగిరెడ్డి.. ఏవీ సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలని ప్రయత్నించారు. నాగిరెడ్డి పీఆర్పీలో చేరిన తర్వాత చిరంజీవిని ఒప్పించి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ వచ్చేలా చేశారు.
మళ్లీ టీడీపీలో చేరిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం సుబ్బారెడ్డికి వచ్చేలా చేశారు నాగిరెడ్డి. వీరిద్దరు ఎంత క్లోజ్ అంటే నాగిరెడ్డి ఫోన్ నంబర్ చివరిలో 111, ఆయన సతీమణి ఫోన్ నంబర్ చివరలో 222, ఏవీ సుబ్బారెడ్డి ఫోన్ నంబర్ చివరలో 333, సుబ్బారెడ్డి సతీమణి ఫోన్ నంబర్ చివరలో 333.. ఉండేది. మిగతా నంబర్ సిరీస్ మొత్తం ఒకటే కావడం విశేషం. ఈ కుటుంబాల కారు నంబర్లు కూడా చాలా దగ్గర ఉండేవి. అఖిలప్రియ, ఆమె సోదరి, తమ్ముడు సుబ్బారెడ్డిని మామా అని పిలిచేవారు. అయితే.. గుండెపోటుతో నాగిరెడ్డి మరణించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాగిరెడ్డి మరణించిన సమయం వరకు ఆయనతోను ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. తర్వాత ఆ కుటుంబానికి దూరం అయ్యారు. నాగిరెడ్డి సంతాప సభకు కూడా ఏవీ సుబ్బారెడ్డిని పిలవలేదు ఆయన కుటుంబ సభ్యులు.
ఆస్తులకు సంబంధించిన విభేదాలే ఇందుకు కారణమన్న ప్రచారం ఉంది. ఆ కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారని ఏవీ సుబ్బారెడ్డి.. ఆయనే తమను మోసం చేశారని అఖిల ప్రియ చెబుతుంటారు. అఖిలప్రియను ఓడించి తీరుతానని గతంలో ఏవీ సుబ్బారెడ్డి అనేక సార్లు బహిరంగంగానే సవాల్ విసరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు అంత సీన్ లేదని అఖిల ప్రియ కౌంటర్లు ఇచ్చారు. అఖిలను కాదని తన కూతురుకు ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వాలని 2019, 2024 ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీ మాత్రం అఖిలకే టికెట్ ఇచ్చింది. అయితే.. ఈ రోజు అఖిల బాడీ గార్డ్ పై దాడి జరగడంతో మళ్లీ ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ విభేదాల వార్తలు తెరపైకి వచ్చాయి.
తనపై గతంలో చేసిన దాడికి కౌంటర్ గానే ఏవీ సుబ్బారెడ్డి అఖిల బాడీ గార్డ్ పై హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి గురైన వ్యక్తి కూడా అదే ఆరోపణ చేశారు. దీంతో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. కనుమరుగైందన్న ఫ్యాక్షన్ తగాదాలు మళ్లీ బయటపడడంతో కర్నూలు జిల్లా వాసులు మాత్రం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
Also Read : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య
AP: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్!
Nandyala: నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై ఈసీ సీరియస్ అయింది. ఎన్నికలకోడ్ అమలు చేయడంలో విఫలమయ్యాడంటూ విచారణకు ఆదేశించింది. శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకీ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ రఘువీరాతోపాటు డీఎస్పీ రవింద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం రాత్రి 7 గంటలలోపు చార్జ్ షీట్ ఫైల్ చేయాలని సీఈసీ స్పష్టం చేసింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ నంద్యాల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నిన్న అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చిన సందర్భంగా భారీ జనం గుమికూడడం, వారిని అదుపు చేయలేకపోవడం ఈసీ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఈ అధికారులపై రాత్రి 7 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే అల్లు అర్జున్, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో ఎలక్షన్ కోడ్, సెక్షన్ 144 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా జనసమీకరణ చేయడంతో కేసు నమోదు చేశారు.
Nandyala: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు!
Case Filed Against Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీర్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల టూ టౌన్ పిఎస్ లో Cr. No.71/2024.U/s 188IPC సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు నంద్యాలలో ఎలక్షన్ కోడ్ (Election Code) అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy) గారి నివాసానికి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బన్నీని చూడటానికి ప్రజలు వేలాదిగా రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ 31 ఏపీ యాక్ట్ , సెక్షన్ 144 అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా కలవడం నేరమని ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్ లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదు చేశారు.