Kodandaram: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని మండిపడ్డారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదని అన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదని చెప్పారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించుకోకపోగా సమర్థించుకోవడం శోచనీయం అని ఫైర్ అయ్యారు. సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
Somireddy: ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్కు లేదు: సోమిరెడ్డి
Somireddy Chandrasekhar Reddy: పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే మదనపల్లె సబ్కలెక్టరేట్ తగులబెట్టారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాకాణి ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని అన్నారు. నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండే ధైర్యం వైసీపీ లేదని అన్నారు. అధికారం కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరు ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్కు లేదని అన్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు
CM Chandrababu: వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని అన్నారు సీఎం చంద్రబాబు. జిల్లా మంత్రులు వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు రూ.3 వేలు తక్షణ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు. పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. వరద బాధితులకు గతం కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
Supreme Court: పశ్చిమబెంగాల్, కేరళ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు
Supreme Court: గవర్నర్ వద్ద పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని సుప్రీం కోర్టును పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రయించాయి. ఏ కారణాలను తెలియజేయకుండానే ఏడాదికి పైగా గవర్నర్లు ఎనిమిది బిల్లులపై కూర్చున్నట్లు రెండు రాష్ట్రాలూ పేర్కొన్నాయి. దీనిపై విచారణ చెప్పట్టింది సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖ, ఇరు రాష్ట్రాల గవర్నర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
Supreme Court issues notice to West Bengal Governor office on West Bengal Government plea against Governor for withholding the assent of pending bills pic.twitter.com/LXeNX9Y7D7
— ANI (@ANI) July 26, 2024
Supreme Court issues notice to the Kerala Governor office on the Kerala Govt plea against the Governor for keeping bills pending for assent.
— ANI (@ANI) July 26, 2024
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: గత ప్రభుత్వం నిర్వహణ లోపంతో పంచాయతీలకు అనేక ఇబ్బందులు తలెత్తాయని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసిందని చెప్పారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేదని అన్నారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పారు. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏకీకృతం చేయలేదని ఆరోపించారు. ఎవరి అనుమతి లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత గత ప్రభుత్వం ఆర్థిక శాఖ డిస్కంలకు పంపేసిందని చెప్పారు. దీనిపైన ప్రత్యేకంగా 4, 5 గంటలు చర్చ జరగాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు.
YS Jagan: హైకోర్టులో జగన్ పిటిషన్పై విచారణ వాయిదా
YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషన్ విచారణార్హతపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని ఏజీ తెలిపారు. విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు ఏజీ. దీంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు గెలవడంతో రాష్ట్ర పగ్గాలను కూలిపోయింది వైసీపీ. దీంతో జగన్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.