Search Results for: kerala
వయనాడ్లో గుండెల్ని పిండేసే దృశ్యాలు | Ground Report From Wayanad | Kerala Rains | RTV
ప్రకృతి శాపమా? మన పాపమా? | Exclusive Ground Report From Wayanad Landslides | Kerala Rains | RTV
Kerala: ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్
Kerala Health Minister Veena George: భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి బుధవారం తన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా వుంటే వయనాడ్లో మృత్యుఘోష ఆగడం లేదు. ఇప్పటికి దాదాపు 254 మంది మరణించినట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల వరకు అదొక ప్రకృతి పర్యాటక ప్రాంతం . కానీ ఇప్పుడు బురద, శిథిలాలు, మృత్యుఘోషతో నిండిపోయింది. కేరళలోని చురల్మలలోని సూచిపర జలపాతం, వెల్లొలిప్పర, సీతా సరస్సు లాంటి ప్రాంతాలకు పర్యాటకులు విపరీతంగా వస్తారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రదేశాలన్నీ విధ్వంసంగా తయారయ్యాయి. దాంతో పాటూ కొంచరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు ఈ సంఖ్య 254కు చేరుకుంది. దాంతో పాటూ మరో మూడు వందల మంది ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: National: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళ డీజీగా సాధనా సక్సేనా నాయర్
Kerala: వయనాడ్లో మృత్యుఘోష.. 254కు చేరిన మృతుల సంఖ్య
Waynad Nature Disaster: నాలుగు రోజుల వరకు అదొక ప్రకృతి పర్యాటక ప్రాంతం . కానీ ఇప్పుడు బురద, శిథిలాలు, మృత్యుఘోషతో నిండిపోయింది. కేరళలోని చురల్మలలోని సూచిపర జలపాతం, వెల్లొలిప్పర, సీతా సరస్సు లాంటి ప్రాంతాలకు పర్యాటకులు విపరీతంగా వస్తారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రదేశాలన్నీ విధ్వంసంగా తయారయ్యాయి. దాంతో పాటూ కొంచరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు ఈ సంఖ్య 254కు చేరుకుంది. దాంతో పాటూ మరో మూడు వందల మంది ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కొండచరియలు విరిగి పడిన కారణంగా చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. మట్టి, రాళ్ళతో భూమంతా కప్పబడిపోయింది. వాటి మధ్య ఏడుపులు, రోదనలతో ప్రజలు తమ వారి కోసం వెతుకులాడుతూ తిరుగుతున్నారు. ఈ దృశ్యాలతో అక్కడి వాతావరణం భయానకంగా, హృదయవిదారకంగా తయారయింది.
ప్రకృతి నెలవు..
కేరళలోని చురమల ప్రాంతం ప్రకృతి అందాలకు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఋ ప్రదేశం అందంగా, ఆహ్లాదంగా ఉందంటే నమ్మడం కష్టం అన్నట్టు తయారయింది. ఇంతకాలం కుటుంబాలతో కలిసి ఆనందాలను పంచుకున్న వారు ఇప్పుడు తమ వారి కోసం రోదిస్తూ కనిపిస్తున్నారు. తాము సర్వం కోల్పోయామని..ఏమీ మిగల్లేదని ఆ ప్రాంతానికి చెందిన వృద్ధుడు ఒకరు చెప్పారు. వయనాడ్ మ్యాప్ నుంచి ముండక్కై అనే ప్రాంతం తుడిచి పెట్టుకుపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమీ మిగలలేదు. మట్టి, రాళ్లు తప్ప మరేమీ లేదని చెప్పారు.
ముండక్కైలో 450 నుంచి 500 ఇళ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో 34-49 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మహిళలు, చిన్నారులు సహా చాలామంది చనిపోయారు. చిపయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి తోడు శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉండిపోయారు. రాజధాని తిరువనంతపురంలో రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ మరియు పోలీసులు ఇప్పటివరకు వేలాది మందికి పైగా ప్రజలను రక్షించారు. దీంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం కూడా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నిన్న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులను పరామర్శించారు.
మరోవైపు కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. దీని గురించి రాజ్యసభలో కూడా మాట్లాడారు. కేంద్రం తరుఫు నుంచి కూడా రెస్క్యూ బృందాలను పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రెస్క్యూ, పునరావాసం కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని..విపత్తు నిర్వహణపై బిల్లును కూడా తీసుకొస్తానని అమిత్ షా సభకు తెలిపారు. ఇక కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రేపు వయనాడ్లో పర్యటించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఇక కేరళకు సహాయం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి సంతోష్ లాడ్తో కలిపి ఒక బృందాన్ని కేరళకు పంపించారు. ఈ విషాన్ని మంత్రి సంతోష్ స్వయంగా తెలిపారు. కేరళలో చనిపోయిన వారిో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు.
VIDEO | Wayanad landslides: “First of all, I would like to lend the Karnataka government’s support to Kerala; CM Siddaramaiah has sent me here, along with the entire team. The entire Karnataka has a lot of sympathy and we are looking forward to support Kerala. As of now, as per… pic.twitter.com/yyKXnU56N8
— Press Trust of India (@PTI_News) July 31, 2024
Also Read: Kerala: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పినరయ్ విజయన్
Kerala: భయపెడుతున్న కొండచరియలు.. బండరాళ్ల కింద నలుగుతున్న బతుకులు
కేరళలోని వయనాడ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారని సిబ్బంది వెలికితీస్తున్నారు. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నివేదికల ప్రకారం 2000-2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దాదాపు 55,000 మంది మరణించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సగటున, కొండచరియలు విరిగిపడడం వల్ల సంవత్సరానికి 4,600 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఇండియాలోనూ ఈ తరహా మరణాల సంఖ్య ఎక్కువే. కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం.. 150కి మందికిపైగా మరణించడం దేశాన్ని విషాదంలో ముంచేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో తరుచుగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఇటు పశ్చిమ కనుమలలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు , మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఘటనలు ఎక్కువే. భారీ వర్షపాతం, చురుకైన టెక్టోనిక్ కదలికల కారణంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచూ జరుగుతుతుంటాయి. కొండలు లాంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడడాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది.
Also Read: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పినరయ్ విజయన్
కొండ ప్రాంతాలలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్లు లేకపోవడం వల్ల నేల కోతకు గురవుతుంది. ఆ సమయంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. వివిధ రకాల వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, విమానం, జలవిద్యుత్ ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వని ప్రకంపనలు కొండచరియలు విరిగిపడటానికి మరొక కారణం. ఈ మోటారు యంత్రాలు కదులుతున్నప్పుడు అన్ని దిశలకు స్థిరమైన ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తాయి. రోడ్ల కింద, పైన పగుళ్లను సృష్టిస్తాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ పగుళ్లలోకి నీరు చేరితే కొండచరియలు విరిగిపడతాయి.
ఇక భూమి క్రస్ట్ తీవ్రంగా వేడెక్కినప్పుడు వర్షం కురిస్తే కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిజానికి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, ఆనకట్టలు లాంటి నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యకలాపాలపై పరిమితి విధించాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయాన్ని లోయలు, మితమైన వాలు ప్రాంతాలకు పరిమిత చేయాలి. నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున అడవుల పెంపకాన్ని చేపట్టాలి. భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం భారత్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఏడాదికి 400 మంది చనిపోతున్నారు. 2013 ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 5,700 మంది మరణించారు. ఇక 2019లో వివిధ ప్రాంతాల్లో కొండచరియల కారణంగా 500 మందికి పైగా మృత్యువాతపడ్డారు.
Also read: ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ