Vijayawada : ఈ రోజు విజయవాడలో జరిగిన ఏపీ ఎన్డీఏ (NDA) ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేధికపై చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), పురంధేశ్వరి (Purandeswari), ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే.. చంద్రబాబు కోసం పసుపు టవల్ వేసిన ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేశారు నాయకులు. అయితే.. చంద్రబాబు సిబ్బందిని పిలిచి తనకు కూడా అందరి లాంటి కుర్చీని వేయాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Viral Video : కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర పరిణామం.. ఆ కుర్చీ మార్పించిన చంద్రబాబు!
ఈ రోజు విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబుకు నేతలు ప్రత్యేక కుర్చీ వేశారు. అయితే.. చంద్రబాబు వేదికపైకి రాగానే తన సిబ్బందికి చెప్పి ఆ కుర్చీని మార్పించారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తన కోసం తెప్పించుకున్నారు.
Translate this News: