Telangana Intermediate Board : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 9 గంటలు దాటితే పరీక్ష రాసేందుకు విద్యార్థులను అధికారులు అనుమతించే వారు కాదు. ఇంటర్ బోర్డు విధించిన ఈ నిబంధన వల్ల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక పోయిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోయామని నిరాశలో కూరుకుపోయి విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను అధికారాలు పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతి సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిమిషం ఆలస్య నిబంధనను తొలిగించింది.
పూర్తిగా చదవండి..Telangana Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన తొలగించిన బోర్డ్
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Translate this News: