Sangareddy : సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ(Telangana) మాజీ గవర్నర్ తమిళిసై(Tamilisai). ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు నాకు.. బీఆర్ఎస్ పార్టీ గ్యాప్ సృష్టించిందని అన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme) పెట్టడానికి యత్నించానని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. కేంద్ర పథకాలు ప్రజలకు అందించాలనేదే తన లక్ష్యం అని అన్నారు. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Tamilisai : కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు.. తమిళిసై విమర్శలు
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు మాజీ గవర్నర్ తమిళిసై. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తనకు.. బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని అన్నారు.
Translate this News: