ఈరోజు విజయవాడలోని బెంజ్ సర్కిల్లో సీఎం జగన్ ఐ ప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేని స్థాయిలో సీట్లు వస్తాయని అన్నారు. 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయని.. 22 కన్నా ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాకవుతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఎక్కువగా మేలు చేద్దామని.. ప్రయాణం ఇలానే కొనసాగిద్దామంటూ పేర్కొన్నారు.
ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. ఈసారి వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు రాబోతున్నాయి: సీఎం జగన్#cmjagan #ysrcongress #apelections pic.twitter.com/obYSL1oJdx
— Vijay Reddy (@vijay_reports) May 16, 2024