Minister Thummala Nageswara Rao: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈరోజు కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు తీపి కబురు అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. మాది రైతు ప్రభుత్వం.. రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం అని అన్నారు. ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం అని అన్నారు. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
TG: రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.ఇకనుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: