Komatireddy Vs Harish rao in Telangana Assembly: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి ఉత్తమ్ (Uttam Kumar) పవర్ పాయింట్ ప్రెజంటేషన్(PPT) ఇచ్చిన తర్వాత హరీశ్రావు మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశమిచ్చారు. ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ఉన్న ప్రెజంటేషన్ ఇచ్చినట్లు హరీశ్రావు (Harish Rao) ఆరోపణలు తేశారు. పీపీటీ కోసం తమకు కూడా అవకాశమివ్వాలని కోరామని.. నిజాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కానీ ఇందుకు స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి VS హరీశ్రావు
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.
Translate this News: