America : అమెరికాలో భారత సంతతి విద్యార్థులు(Indian Students) వరుసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. అయితే తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగో(Chicago) లో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. ‘ఇండియాకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది అనే విద్యార్థి మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్ ఆచూకి తెలుస్తుందని ఆశిస్తున్నామని’ షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..
అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
Translate this News: