Reservations : లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో(Election Campaign) మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. పెద్దపల్లి కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ఆధారంగానే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తేనే అబద్ధాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్ని అబద్ధాలే ప్రచారాలు చేస్తున్నారని .. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..CM Revanth : రిజర్వేషన్ల ఆధారంగానే లోక్సభ ఎన్నికలు : రేవంత్
రిజర్వేషన్ల ఆధారంగానే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని.. ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు.. కాంగ్రెస్కు ఓటేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
Translate this News: