Revanth Reddy Vs KCR : 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాత్రికేయులతో ఛలో కాళేశ్వరం(Chalo Kaleshwaram) అంటూ బయలుదేరుతున్నారు తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex. CM KCR). వారందరితో పాటూ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage), కన్నెపల్లి పంప్ హౌస్ల పరిశీలన చేయనున్నారు. అక్కడే కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం నాణ్యతపై వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక రేవంత్ రెడ్డితో పాటూ కాళేశ్వరానికి ప్రభుత్వంలోని హేమా హేమాలీ, అధికారులు వెళ్ళనున్నారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మేడిగడ్డ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana : రేపు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే రేపు నల్లగొండలో కేసీఆర్ సభ జరుగుతండగా కాళేశ్వరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి.
Translate this News: