కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఛత్తీస్గఢ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్గ్లో ర్యాలీ నిర్వహించి భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భిలాయ్ను మినీ ఇండియాగా పరిగణిస్తున్నారని అమిత్ షా అన్నారు. ఎన్నికల సమయంలో పది లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 2,500 భ్రుతి కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిన సంగతిని గుర్తు చేస్తూ అమిత్ షా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రికి సిగ్గుండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు అమిత్ షా.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ కోటలో అమిత్ షా గర్జన…భూపేష్ బఘేల్ సర్కార్ పై సంచలన ఆరోపణలు..!!
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 9ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు అన్ని రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గురువారం ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కాలంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను షా వివరించారు. దీంతో పాటు భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశాడు. అంతేకాదు రాహుల్ గాంధీపై కూడా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.భూపేష్ బఘేల్ స్కాంలకు పాల్పడ్డారంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
Translate this News: