India at Asian Games Reached semifinals: ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నేపాల్, భారత్ (India Vs Nepal) మధ్య జరిగాయి. ఈ మ్యాచ్ లో యువ ట్రీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 203 భారీ స్కోరును నేపాల్ ముందు ఉంచింది. తర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నేపాల్ 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీపేంద్ర సింగ్ ఐరీ 32 పరుగలతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నేపాల్ టీమ్ బ్యాటర్లు మ్యాచ్ గెలవడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. వికెట్లు పడుతున్నా సిక్స్ల మీద సిక్స్లు బాదారు. ఒకదశలో నేపాట్ జట్టు మ్యాచ్ గెలుస్తుందేమో అనుకున్నారు కూడా. అయితే టీమ్ ఇండియా బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో గెలుపును సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో ఆవేశ్ కాన్ 3, రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీసుకోగా, అర్షదీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Asian Games 2023:నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా
ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది.
Translate this News: