ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో దారుణ హత్య కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మెయిన్ పురిలోని ఓ ఇంట్లో పెళ్లి ఉండటంతో..కుటుంబ సభ్యులు, బంధువులంతా ఒకచోటకు చేరారు. అక్కడేం జరిగిందో తెలియదు…నిందితుడు బంధువులు, కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు అక్కడిక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈఘటనను అడ్డుకునే యత్నించిన మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ హత్యలు ఎందుకు చేశారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఘటనాస్థలానికి ఎస్పీతోపాటు పలువురు ఉన్నాతాధికారులు చేరుకున్నారు. ఈ ఘటన సంబంధించి దర్యాప్తు చేపట్టామని పూర్తివివరాలను వెల్లడిస్తామని తెలిపారు.