YCP Shock : ఏపీ(AP) లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ(YCP) కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా(East Godavari) అనపర్తి(Anaparthy) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కి చెందిన 1000 మంది కార్యకర్తలు టీడీపీ(TDP) తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుండి 2019 వరకు వైసీపీ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయానికి కృషిచేసిన ఆది యూత్ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సుమారు 1000 బైకులతో అనపర్తి దుప్పలపూడి గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరం లోని ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన సభలో ఆది యుత్ నాయకుడు మల్లిడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు.
పూర్తిగా చదవండి..TDP : అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 1000 మంది..!
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.1000 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుండి 2019 వరకు వైసీపీ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయానికి కృషి చేసిన ఆది యూత్ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
Translate this News: